Image

మహారాణా ప్రతాప్

వియత్నాం దేశంవారికాదర్శం మహారాజ రాణాప్రతాప్ ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. ప్రపంచంలో అత్యంత బలశాలి అయిన అమెరికా తలని వంచింది. కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్దంలో ఆకరికి అమెరికాని ఓడించింది. అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడికి ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు. విలేకరి: ఇప్పటికీ అర్థంకాని విషయమేమిటంటే,అమెరికాని ఓడించి యుద్దంలో ఎలా గెలిచారు. ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానం విని మీరు చాలా గర్వంగాచ ఫీల్ అవుతారు. అన్నీ దేశాలలోకెల్ల శక్తిశాలి అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు ,శ్రేష్టమైన దేశభక్తిగల భారతీయ రాజు చరిత్రను చదివాను.అతని జీవనంనుండి ప్రేరణపొంది యుద్దనీతి ,ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్దంలో గెలిచాము. విలేకరి అడిగాడు: ఎవరా భారతీయ మహారాజు? వియత్నాం అద్యక్షుడు నిలబడి గర్వంతో ఇలా సమాధానం చెప్పాడు. ”అతడే రాజస్తాన్లోని మేవాడ్ మహారాజు రాణా ప్రతాప్ సింహ్” మహారణా ప్రతాప్ సింహ్ పేరు చెప్పెటప్పుడు అతని కళ్ళలో వీరత్వం నిండి వెలుగు ఉన్నది. అలాగే ఇలా అన్నాడు “ఒకవేళ అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవారం.” ^కొన్ని రోజుల తరువాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు అయితే అతని సమాధి మీద ఇలా రాశి ఉంది “ఇది మహారణా ప్రతాప్ యొక్క శిష్యుడిది” అని రాసి పెట్టారు. కాలాంతరంలో వియత్నాం విదేశాంగమంత్రి భారత పర్యటనకి వచ్చాడు.మహామహుల శ్రద్ధాంజలి ఘటించడానికి మొదట గాంధీ సమాధి అతనికి చూపించారు ఆ తరువాత ఎర్రకోట,ఇంకా,ఇంకా ఇలా చూపించారు. ఇవన్నీ చూపించేటప్పుడు ఆ విదేశాంగమంత్రి ఇలా అన్నాడు “ మహారణా ప్రతాప్ సమాధి ఎక్కడ?”. ఇవన్నీ చూపిస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి ఉదయపూర్లో ఉన్నదని చెప్పాడు. విదేశాంగమంత్రి అక్కడనుండి ఉదయ్ పూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడనుండి పిడికడు మట్టిని తీసుకొని అతని బ్యాగ్ లో పెట్టుకున్నాడు.ఇది చూసిన భారత అధికారి మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికి కారణం అడిగాడు....”ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులను కన్నది, ఈ మట్టిని తీసుకెళ్లి మాదేశం మట్టిలో కలుపుతా. మా దేశంలో కూడా ఇలాంటి రాజు ప్రేరణతో దేశభక్తులు జన్మిస్తారు. మహారణా ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ రాజు” అని అన్నాడు మహారణా ప్రతాప్ సింహ్ గురించి వివరిస్తాను అందరూ షేర్ చేయండి. పేరు-కుంవర్ ప్రతాప్ జి(శ్రీ మహారాణా ప్రతాప్ సింహ్) జన్మదినం-9 మే,1540 జన్మభూమి-రాజస్థాన్ కుంబల్ ఘడ్ పుణ్యతిది-29 జనవరి,1597 తండ్రి – మహారణా ఉదయ్ సింహ్ జి తల్లి-రాణి జీవత్ కాంవర్ జి రాజ్య సీమ-మేవాడ్ శాశన కాలం -1568-1597(29 సంవత్సరాలు) వంశం –సూర్యవంశం రాజవంశం-సిసోడియ రాజపుత్రులు ధార్మికం-హిందూధర్మం ప్రసిద్ధ యుద్దం- హల్ది ఘాట్ యుద్దం రాజధాని-ఉదయ్ పూర్. ఇంకా తెలుసుకోవాల్సినవి- శ్రీ మహారణా ప్రతాప్ దగ్గర అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”. అబ్రాహిం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ కి వచ్చేది ఉండే అప్పుడు తన తల్లి భారత్ నుండి ఏమి తీసుకొనిరావాలి అని అన్నాడట. దానికి అతని తల్లి “రాజస్థాన్లోని మేవాడ్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా , అక్కడి రాజు ఎంత విశ్వశాపాత్రుడగా ఉండేవాడు అంటే సగం భారత్ ను ఇస్తా అని ప్రలోభపెట్టిన తన రాజ్య సుఖ శాంతి ప్రయోజనాలనే కోరుకొని తన మాతృభూమినే కోరుకున్నాడు” అని చెప్పిందట. కానీ కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దు అయ్యింది. ఈ విషయాలు “బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యు ఎస్ ఏ” లో చదువొచ్చు. *మహారణా ప్రతాప సింహ్ యొక్క ఈటె 80 కిలోలు ఉంటుంది.చేతి కవచం,శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి. అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి. ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి. *డిల్లీ బాద్షాహ్ అయినటువంటి అక్బర్ మహారణా ప్రతాప్ ని ఒకసారి తల దించి నా కాళ్ళ మీద పడుతే సగం హిందూస్థాన్కి రాజుని చేస్తా అని ప్రలోభపెట్టాడు కానీ మహారణా ప్రతాప్ దాన్ని తుచ్ఛమైనదిగా తిరస్కరించాడు. *హల్దిఘాట్ యుద్దంలో మేవాడ్ సైన్యం 20000 సైనికులతో ఉంటే అక్బర్ సైన్యం 85000 సైనికులతో సమీకరించబడాయి * మహారణా ప్రతాప్ ఇష్టమైన గుర్రంకి తన త్యాగానికి గుర్తుగా ఒక గుడిని కూడా కట్టారు ,ఆ గుడి ఇప్పటికీ సురక్షితంగా ఉంది. * మహారణా యుద్దంలో తన అభేద్యమైన దుర్గం లను వదులుకున్నప్పటినుండి కంసాలి వాళ్ళు వేల సంఖ్యలో వాళ్ళ ఇళ్ళను వదిలి రాణా కోసం ఆయుధాలు తయారు చేసేవారు.వాళ్ళ దేశ భక్తికి నా తల వంచి ప్రణమిల్లుతున్నాను అన్నాడు. * హల్ది ఘాట్ యుద్దం జరిగి 300 సంవత్సరాల తరువాత కూడా అక్కడి నెలలో కత్తులు లభించాయి. చివరి సారిగా 1985 లో ఒక ఆయుదం దొరికింది. * మహారణా ప్రతాప్ సింహ్ దగ్గర యుద్ద శిక్షణ శ్రీ జైమల్ మేడతీయ ఇచ్చేవాడు. 8000 మంది రాజపుత్రుల వీరులతో కలిసి 60000 మంది మొఘలులతో యుద్దం చేశారు. ఆ ఆయుద్దంలో 48000 మంది చనిపోయారు.ఇందులో 8000 మంది రాజపుత్రులు 40000 మంది మొఘలులు * మహారణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట. * హల్ది ఘాట్ యుద్దంలో మేవాడ్ భీల్ అనే ఆదివాసీలు వారి యొక్క అభేద్యమైన బాణాలతో మొఘలులతో పోరాడారు .వాళ్ళు మహారాణాను వారి పుత్రుడిగా భావించేవారు.మహారాణా కూడా వారిపట్ల భేదభావం చూపించేవారు కాదు. ఇప్పటికీ మేవాడ్ రాజచిహ్నం లో ఒకపక్క రాజపూత్ మరొక పక్క భీల్ ఉంటారు. * రాణా గుర్రం అయిన చేతక్ మహారణాను 26 అడుగుల కందకాన్ని దుమికి అది దాటిన తరువాత చనిపోయింది. అంతకంటే ముందే దానికి ముందరి ఒక కాలు విరిగి ఉన్నప్పటికి ఆ కందకాన్ని దుమికింది.అది ఎక్కడైయతే చనిపోయిందో అక్కడే ఒక చింత చెట్టు పెరిగింది.అదే ప్రదేశంలో దాని గౌరవార్దం చేతక్ మందిరం కట్టారు. *చేతక్ ఎంత బలమైనదంటే ఎదుట ఏనుగుమీద ఉన్న సైనికుణ్ణి అందుకోవటానికి ఎంత ఎత్తు ఎగరాలోఅంత ఎత్తు గాలిలో ఎగిరేది అది కూడా మహారణాతో పాటుగా *మహారణా చనిపోవడానికి ముందు తాను కోల్పోయిన వాటిలో 85% తిరిగి గెల్చుకున్నాడు. *శ్రీ మహారణా ప్రతాప్ యొక్క బరువు 110 కిలోలు మరియు అతని పొడవు 7’5’’. ఇరువైపుల దారు ఉన్నటువంటి కత్తి, 80 కిలోల ఈటె తన వద్ద వుంచుకునే వాడు. *మిత్రులారా మహారణా ప్రతాప్ ,అతని గుర్రం గురించి విన్నారు , అతనికి ఒక ఏనుగు కూడా ఉండేది.దాని పేరు రాంప్రసాద్. *అల్ బదౌని అనే రచయిత రాంప్రసాద్ ఏనుగు గురించి తన గ్రంధంలో రాసుకున్నాడు. * అక్బర్ బాద్షాహ్ మేవాడ్ మీద యుద్దం చేసేటప్పుడు తన సైన్యానికి ఏమని ఆదేశించాడంటే.మహారణా ప్రతాప్ తోపాటుగా రాంప్రసాద్ ఏనుగుని కూడా బందీగా పట్టుకుంటే సరిపోద్ది అని చెప్పాడట. * రాంప్రసాద్ ఎంత బలం కలిగినదంటే ఒక్కత్తే మొఘలుల 13 ఏనుగులని చంపిండట.అలాగే దాన్ని పట్టుకోవడానికి 7 పెద్ద ఏనుగులమీద 14 మంది నైపుణ్యం కలిగిన మావటిలు కూర్చుని ఒక చక్రవ్యూహం ప్రకారంగా దాన్ని బందీ చేశారట అని అల్ బదౌని తన రచనల్లో పేర్కొన్నాడు. *బందీని చేసిన రాంప్రసాద్ ని అక్బర్ ముందు నిలబెట్టగా దానికి పీర్ ప్రసాద్ అని నామకరణం చేశాడు.ఆ ఏనుగు ఎంత స్వామి భక్తి కాలదంటే 18 రోజులవరకు దాణా తినకుండా,నీళ్ళు తగకుండా తన ప్రాణాలు కోల్పోయింది.తరువాత ఈ దృశ్యాన్ని చూసిన అక్బర్ నా ముందు ఈ ఏనుగుని వంచ లేకపోయాను మహారాణాను ఎలా వంచగలుగుతా అని అన్నాడట. భారత్ మాతా కి జై

👈Click to Share in Whatsapp
గ్రంథాలయం

సేకరణ : Social Media

Popular Posts

సంపద

సహాయం